జమున మా బంధువు.. అందుకే ఈటలను కలిశా: కొండా విశ్వేశ్వరరెడ్డి
ABN, First Publish Date - 2021-05-07T02:20:24+05:30
జమున మా బంధువు.. అందుకే ఈటలను కలిశా: కొండా విశ్వేశ్వరరెడ్డి
మేడ్చల్: ఈటల రాజేందర్ తనకు పాత మిత్రుడని మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి అన్నారు. ఈటల రాజేందర్తో భేటీ అనంతరం కొండా విశ్వేశ్వరెడ్డి మీడియాతో మాట్లాడారు. ఈటల భార్య జమున తమకు బంధువు అని కొండా విశ్వేశ్వరరెడ్డి తెలిపారు. ఒక బంధువుగానే ఈటలను కలిశానని చెప్పారు. బర్త్ రఫ్ వార్త విని సానుభూతి తెలిపానన్నారు. రాజకీయ నాయకుడిగా ఈటల నివాసానికి వెళ్లలేదని, రాజకీయాలు మాట్లాడలేని పేర్కొన్నారు. తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం కేసీఆర్కు అలవాటేనని కొండా విశ్వేశ్వరరెడ్డి అన్నారు.
Updated Date - 2021-05-07T02:20:24+05:30 IST