తెలంగాణలో మరో పార్టీ అవసరం ఉంది: కొండా విశ్వేశ్వరరెడ్డి
ABN, First Publish Date - 2021-10-25T22:56:13+05:30
రాష్ట్రంలో మరో పార్టీ అవసరం ఉందని మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర రెడ్డి అభిప్రాయం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజలను...
కరీంనగర్: రాష్ట్రంలో మరో పార్టీ అవసరం ఉందని మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర రెడ్డి అభిప్రాయం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజలను కేసీఆర్ మోసం చేస్తున్నారని ఆయన తెలిపారు. ఈటెల మీద లేని పోని ఆరోపణలు చేసి టీఆర్ఎస్ నుంచి బయటకు పంపించారన్నారు. ఉద్యమకారులందరికి ఈటెల రాజేందర్ గెలవాలని ఉందని చెప్పారు. 40 వేల ఓట్లతో ఓడిపోతా అని సర్వే రిపోర్ట్ రావడంతో కేసీఆర్ వెనుక అడుగు వేశారని వ్యాఖ్యానించారు. గంగుల కమలాకర్పై నమ్మకం లేక హరీష్కు బాధ్యతలు అప్పగించారని చెప్పారు. ప్లీనరీలో హరీష్రావుది ఒక్క ఫ్లెక్సీ కూడా పెట్టలేదని కొండా విశ్వేశ్వర రెడ్డి పేర్కొన్నారు.
Updated Date - 2021-10-25T22:56:13+05:30 IST