రాష్ట్రంలో అయ్యా కొడుకుల డ్రామాలు ఆపండి: కోమటిరెడ్డి
ABN, First Publish Date - 2021-05-15T17:58:47+05:30
హైదరాబాద్: తెలంగాణ సీఎం కేసీఆర్పై కాంగ్రెస్ పార్టీ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మండిపడ్డారు. కరోనా విషయంలో కేసీఆర్ అసలు పట్టించుకోవడం లేదంటూ మండిపడ్డారు.
హైదరాబాద్: తెలంగాణ సీఎం కేసీఆర్పై కాంగ్రెస్ పార్టీ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మండిపడ్డారు. కరోనా విషయంలో కేసీఆర్ అసలు పట్టించుకోవడం లేదంటూ మండిపడ్డారు. ‘‘కేసీఆర్ నీకు మానవత్వం ఉందా? కరోనాను ఆరోగ్య శ్రీలో చేర్చుతానని అసంబ్లీ సాక్షిగా చెప్పావు కదా ఏమయ్యింది? కేసీఆర్ కరోనాను ఆరోగ్య శ్రీలో ఎప్పుడు చేర్చుతారని కేటీఆర్ను ప్రజలు ట్విట్టర్ వేదికగా నిలదీస్తున్నారు. ఈ విషయాన్ని మీ దృష్టికి కేటీఆర్ తీసుకవచ్చారా లేదా కేసీఆర్? రాష్ట్రంలో అయ్యా కొడుకుల డ్రామాలు ఆపండి. కరోనా నుంచి ప్రజలను కాపాడండి. ముఖ్యమంత్రి పదవిలో కొనసాగడనికి నీకు అర్హుతా లేదు కేసీఆర్. నీ పాలన చూసి తెలంగాణ తల్లి కన్నీరు పెడుతోంది. కేసీఆర్కు ప్రజల ఉసురు తగులుతుంది’’ అని కోమటిరెడ్డి వెంకట్రెడ్డి మండిపడ్డారు.
Updated Date - 2021-05-15T17:58:47+05:30 IST