రైతులకు సంకెళ్లేసిన చరిత్ర కేసీఆర్ది : కోదండరెడ్డి
ABN, First Publish Date - 2021-11-27T18:08:53+05:30
వరి రైతుల భాధలు తెలియజేస్తున్నాం తప్ప.. కాంగ్రెస్ పార్టీ రాజకీయాలు చేయలేదని జాతీయ కిసాన్ సెల్ ఉపాధ్యక్షుడు కోదండరెడ్డి పేర్కొన్నారు. కాంగ్రెస్ వరి దీక్షలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ..
హైదరాబాద్ : వరి రైతుల భాధలు తెలియజేస్తున్నాం తప్ప.. కాంగ్రెస్ పార్టీ రాజకీయాలు చేయలేదని జాతీయ కిసాన్ సెల్ ఉపాధ్యక్షుడు కోదండరెడ్డి పేర్కొన్నారు. కాంగ్రెస్ వరి దీక్షలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. టీఆర్ఎస్, బీజేపీలు తమ చేతిలో అధికారం ఉన్నా... రైతులతో రాజకీయం చేసిందన్నారు. గతంలో ఎలాంటి సాంకేతికత అందుబాటులో లేని సమయంలో కూడా కాంగ్రెస్ వరి ధాన్యం కొనుగోలు చేసిందన్నారు. రైతులకు సంకెళ్లు వేసిన చరిత్ర కేసీఆర్దేనన్నారు. వరి పండించండని.. వద్దని కేసీఆరే చెప్తాడని.. అసలు ఆయనకు వ్యవసాయం గురించే తెలియదని కోదండరెడ్డి పేర్కొన్నారు.
Updated Date - 2021-11-27T18:08:53+05:30 IST