నాగర్ కర్నూల్ జిల్లాలో కెఎల్ఐ కాలువకు గండి
ABN, First Publish Date - 2021-03-22T16:44:52+05:30
జిల్లాలో పంటలకు సాగునీరందిస్తున్న కెఎల్ఐ
నాగర్ కర్నూల్: జిల్లాలో పంటలకు సాగునీరందిస్తున్న కెఎల్ఐ కాలువ తెగింది. కోడెర్ మండలంలోని సింగాయిపల్లి గ్రామం దగ్గర కెఎల్ఐ డి8 కాలువ తెగింది. కాలువ నుంచి నీరు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో పంటపొలాలు మునిగాయి. దీంతో రైతులకు తీవ్ర స్థాయిలో నష్టం వాటిల్లింది. కాలువ తెగి నీరు వృథాగా పోతుండడంతో పలు గ్రామాలకు సాగునీరు నిలిచిపోయింది.
Updated Date - 2021-03-22T16:44:52+05:30 IST