తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారు: కిషన్రెడ్డి
ABN, First Publish Date - 2021-08-21T23:40:35+05:30
తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని కేంద్రమంత్రి కిషన్రెడ్డి తెలిపారు. హైదరాబాద్లో కిషన్రెడ్డి జన ఆశీర్వాద యాత్ర నిర్వహిస్తున్నారు.
హైదరాబాద్: తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని కేంద్రమంత్రి కిషన్రెడ్డి తెలిపారు. హైదరాబాద్లో కిషన్రెడ్డి జన ఆశీర్వాద యాత్ర నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘‘తెలంగాణలో కల్వకుంట్ల పరిపాలనను తరిమికొడదాం. బీజేపీ నాయకత్వంలో ధర్మంతో కూడిన పాలన తెలంగాణ ప్రజలకు లభించబోతోంది. ఏడేళ్ళుగా సీఎం కేసీఆర్ ఫాంహౌస్లో పడుకున్నారు. సచివాలయం లేని రాష్ట్రం దేశంలో తెలంగాణ మాత్రమే. సచివాలయానికి వెళ్లడం ఇష్టంలేకనే కేసీఆర్ సచివాలయాన్ని కూల్చివేశారు. డిసెంబరు నాటికి దేశంలో అందరకీ వ్యాక్సిన్ ఇస్తాం. హైదరాబాద్లో వ్యాక్సిన్ తయారు కావటంలో కేంద్రం పాత్ర కీలకం’’ అని కిషన్రెడ్డి చెప్పారు.
Updated Date - 2021-08-21T23:40:35+05:30 IST