ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పిల్లలను చంపి ఆపై తల్లి ఆత్మహత్య

ABN, First Publish Date - 2021-12-12T01:24:14+05:30

జిల్లాలోని రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రంగారెడ్డి: జిల్లాలోని రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. తన ఇద్దరు పిల్లలను చంపి ఆపై తాను ఆత్మహత్యకు ఓ తల్లి పాల్పడింది. స్థానికులు తెలిపిన ప్రకారం భర్త వేధింపులు తాళలేక పిల్లలు శ్రీయ(4), తన్వీక్(5)లతో కలిసి స్వాతి అనే గృహిణి ఆత్మహత్యకు పాల్పడింది. స్వాతి భర్త సాయి సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. గతకొంతకాలంగా ఉప్పర్‌పల్లి ఫోర్ట్ వ్యూ కాలనీ శ్రీనివాస్ అపార్ట్ మెంట్‌లో వీరు నివాసం ఉంటున్నారు. మధ్యాహ్నం నుంచి భర్తతో స్వాతికి గొడవ జరిగింది. దీంతో మనస్తాపం చెందిన స్వాతి తన గదిలో గోడకు పెన్నుతో సూసైడ్ నోట్ రాసింది.


బెడ్రూంలో తన ఇద్దరు పిల్లలను ఫ్యానుకు ఉరివేసి, వారు చనిపోయారని నిర్ధారించుకున్నాక ఆపై తాను కూడా ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. భర్త ఇంట్లో ఉన్న సమయంలోనే ఈ ఘటన జరిగింది. భార్య ఆత్మహత్య చేసుకున్న విషయం తెలుసుకొని అక్కడి నుంచి భర్త పరార్ అయ్యాడు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

Updated Date - 2021-12-12T01:24:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising