అభివృద్ధి కోసమే టీఆర్ఎస్లో చేరా
ABN, First Publish Date - 2021-09-19T05:07:30+05:30
నియోజకవర్గ అభివృద్ధి కోసమే టీఆర్ఎస్ పార్టీలో చేరానని ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు పేర్కొన్నారు.
ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు
ములకలపల్లి, సెప్టెంబర్ 18: నియోజకవర్గ అభివృద్ధి కోసమే టీఆర్ఎస్ పార్టీలో చేరానని ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు పేర్కొన్నారు. ములకలపల్లి మార్కెట్ యార్డులో శనివారం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. పదవులు, డబ్బు కోసమో తాను టీఆర్ఎస్ పార్టీలో చేరలేదని స్పష్టం చేశారు. ఆదివారం నుంచి ప్రతి గ్రామంలో పర్యటిస్తా.. అన్ని సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తానన్నారు. అందరి సమక్షంలోనే టీఆర్ఎస్ మండల అధ్యక్షుడిని ఎన్నుకోవాలన్నారు. ప్రస్తుతం టీఆర్ఎస్ మండల అధ్యక్ష పదవికి ఆరుగురు పోటీలో ఉన్నారని అన్నారు. ములకలపల్లి మండల అధ్యక్షుడిని ఎన్నుకునే విషయంలో గ్రామ కమిటీలతో ఈ రెండు రోజుల్లో దమ్మపేట జడ్పీటీసీ పైడి వెంకటేశ్వరరావు, దొడ్డాకుల రాజేశ్వరరావు పర్యటించి అభిప్రాయాలను సేకరించాల్సిందిగా ఆయన ఆదేశించారు.
Updated Date - 2021-09-19T05:07:30+05:30 IST