ఆగిఉన్న లారీని ఢీ కొన్న బైక్
ABN, First Publish Date - 2021-07-27T05:01:16+05:30
ఆగిఉన్న లారీని అతి వేగంతో వస్తున్న ఓ బైక్ ఢీ కొన్న సంఘటనలో ఒకరు మృతి చెందగా, మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ సంఘటన చుంచుపల్లి మండల పరిధిలో సోమవారం చోటు చేసుకొంది.
ఒకరు మృతి.. మరొకరి పరిస్థితి విషమం
చుంచుపలి, జులై 26: ఆగిఉన్న లారీని అతి వేగంతో వస్తున్న ఓ బైక్ ఢీ కొన్న సంఘటనలో ఒకరు మృతి చెందగా, మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ సంఘటన చుంచుపల్లి మండల పరిధిలో సోమవారం చోటు చేసుకొంది. కొత్తగూడెం టూటౌన్ సీఐ సత్యనా రాయణ వివరాలు ప్రకారం... చంద్రుగొండ మండలం లోని ముద్దుకూరు గ్రామానికి చెందిన సోమా (25), దేవా బైక్పై జగ్గారం గ్రామానికి వెళుతున్నారు. ఈ క్రమంలో సీతాయిగూడెం క్రాస్రోడ్డు వద్ద ఆగిఉన్న లారీని ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో బైక్ నడుపుతున్న సోమా అక్కడిక్కడే మృతి చెందగా, దేవా పరిస్థితి విషమంగా ఉంది. స్థానికులు 108కు సమాచారం అందించి కొత్తగూడెం ఏరియా ఆస్పత్రికి తరలించారు.
Updated Date - 2021-07-27T05:01:16+05:30 IST