ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రాణం తీసిన సెల్ఫీ సరదా

ABN, First Publish Date - 2021-10-18T04:49:28+05:30

సరదాగా షికారు కోసమని తెప్పపై చెరువు మధ్యలోకి వెళ్లిన ముగ్గురుయువకులు సెల్ఫీ తీసుకుంటున్న సమయలోఓ ఆ తెప్ప బోల్తా పడి ఓ యువకుడు మృతిచెందగా.. మరో ఇద్దరు ప్రాణాలతో బయటపడిన సంఘటన ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం తనికెళ్లలో ఆదివారం సాయంత్రం జరిగింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

షికారు కోసం నాటుపడవపై చెరువులోకి 

పడవ బోల్తా పడి యువకుడి మృతి.. మరో ఇద్దరు క్షేమం

ఖమ్మం జిల్లా తనికెళ్లలో ఘటన

కొణిజర్ల, అక్టోబరు 17: సరదాగా షికారు కోసమని తెప్పపై చెరువు మధ్యలోకి వెళ్లిన ముగ్గురుయువకులు సెల్ఫీ తీసుకుంటున్న సమయలోఓ ఆ తెప్ప బోల్తా పడి ఓ యువకుడు మృతిచెందగా.. మరో ఇద్దరు ప్రాణాలతో బయటపడిన సంఘటన ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం తనికెళ్లలో ఆదివారం సాయంత్రం జరిగింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం తనికెళ్లకు చెందిన బత్తుల వెంకటకృష్ణ (19), మరో ఇద్దరు యువకులు చల్లా వీరన్న, రవీందర్‌తో కలిసి గ్రామ సమీపంలోని నరసింహుల చెరువులోకి తెప్పపై షికారు చేసేందుకు వెళ్లారు. ఈ క్రమంలో తెప్పపై ఉండి సెల్ఫీలు దిగుతుండగా అది తిరగపడింది. దీంతో ఆ ముగ్గురు యువకులు నీటిలో పడిపోగా.. ఈత రాకపోవడంతో వెంకటకృష్ణ మునిగాడు. వీరన్న, రవీందర్‌ ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకున్నారు. వెంకటకృష్ణ కోసం ఈతగాళ్ల సహాయంతో గాలించగా.. మృతదేహం లభ్యమైంది. మృతుడు వెంకటకృష్ణ తండ్రి నాగేశ్వరరావు ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ రవి మృతదేహాన్ని ఖమ్మం ప్రభుత్వాసుపత్రికి తరలించి కేసు నమోదు చేశారు. 

Updated Date - 2021-10-18T04:49:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising