ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్యూనిస్టులు బలపడితేనే దేశానికి భద్రత: సీపీఎం

ABN, First Publish Date - 2021-10-30T05:06:37+05:30

దేశంలో కమ్యూనిస్టులు గల్లినుంచి డిల్లీ వరకు బలపడితేనే దేశంలో భద్రత సాద్యం అవుతుందని సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు కల్యాణం వెంకటేశ్వరరావు అశాభావాన్ని వ్యక్తం చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పెనుబల్లి, అక్టోబరు 29: దేశంలో కమ్యూనిస్టులు గల్లినుంచి డిల్లీ వరకు బలపడితేనే దేశంలో భద్రత సాద్యం అవుతుందని సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు కల్యాణం వెంకటేశ్వరరావు అశాభావాన్ని వ్యక్తం చేశారు. శుక్రవారం మండల పరిదిలోని లంకపల్లి లో సీపీఎం పెనుబల్లి మండల 8వ మహసభ లో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కేంద్రంలో మోదీ ప్రభుత్వ రంగ సంస్థలను కార్పోరేట్లకు అమ్ముకుంటున్నారని, పోడుసాగుదారులకు పట్టాలు ఇవ్వమంటే కేసులు పెడుతూ కంపెనీలకు కట్ట పెడుతున్నారని ఆయన విమర్శించారు. రాష్ట్రం లోని కేసీఆర్‌ ప్రభుత్వం మోదీ తెచ్చిన నల్ల చట్టలకు వంతపడుతుందని, ఎర్ర జెండాలను అధికారంలోని తెచ్చుకుంటేనే ప్రజాస్వామ్యం బతుకుతుందన్నారు. సీనియర్‌ నాయకులు మూడ్‌ దూప్‌ సింగ్‌ జెండాను అవిష్కరించారు. 

 మండల కార్యదర్శిగా తిరుపతిరావు

పెనుబల్లి  సీపీఎం మండల  కార్యదర్శిగా మండాలపాడు గ్రామకి చెందిన గాయం తిరుపతిరావును శుక్రవారం లంకపల్లి లో జరిగిన మండల మహసభలో ఏకగ్రీవంగా ఎన్నికైనారు. ఇప్పటీవరకు మండల కార్యదర్శి గా పని చేసిన చలమాల విఠల్‌ రావు మూడు పర్యాయాలు పని చేశారు. ఈసభలో జిల్లా నాయకులు మాచర్ల భారతి, తాతాభాస్కర్‌ రావు, మోరంపూడిపాండురంగారావు,జాజిరి శ్రీనివాసరావు,రావుల రాజబాబు,మామిళ్ళ వెంకటేశ్వర్లు,తాండ్ర రాజేశ్వరరావు,అర్వపల్లి జగన్‌ మోహన్‌ రావు, తిరుపతిరావు, చలమాల నరసింహరావు, రాజారావు, మంగమ్మ తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-10-30T05:06:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising