ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఈటల నిజాయితీ పరుడని ప్రజలు నమ్మారు: రేణుక చౌదరి

ABN, First Publish Date - 2021-11-03T20:56:29+05:30

హుజురాబాద్‌లో టీఆర్ఎస్ తుక్కుతుక్కుగా ఓడిపోయిందని రేణుక చైౌదరి విమర్శించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఖమ్మం: హుజురాబాద్‌లో టీఆర్ఎస్ తుక్కుతుక్కుగా ఓడిపోయిందని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి రేణుక చౌదరి అన్నారు. బుధవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ ఈటల రాజేందర్ నిజాయితీ పరుడని ప్రజలు నమ్మారని, అందుకే గెలిపించారన్నారు. ఈ పోటీ ఈటెల, సీఎం కేసీఆర్ మధ్య వ్యక్తిగతంగా జరిగిందన్నారు. కేసీఆర్‌కు ఎవరూ దొరక్క, కాంగ్రెస్‌ను తిడుతున్నారని మండిపడ్డారు. ఈటెల దొరికారని బీజేపీ గెంతులేస్తే ఏమీకాదన్నారు. ఈటెల గెలుపుతో బీజేపీకు కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్లుగా ఉందని ఎద్దేవా చేశారు. రాష్ట్ర కాంగ్రెస్‌లో భిన్నాభిప్రాయాలు ఉన్నాయని, అభ్యర్థిని ఆలస్యంగా ప్రకటించడం కాంగ్రెస్‌లో సాధారణమేనని, అన్ని సమీక్షించుకుని సరిచేసుకుంటామని రేణుక చౌదరి వ్యాఖ్యానించారు.



Updated Date - 2021-11-03T20:56:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising