వైభవంగా ముత్యాలమ్మ జాతర ప్రారంభం
ABN, First Publish Date - 2021-03-02T05:18:54+05:30
దుమ్ముగూడెం ముత్యాలమ్మ అమ్మవారి 21వ జాతర మహోత్సవాలు సోమవారం వైభవంగా మొదలయ్యాయి. సీఐ నల్లగట్ల వెంకటేశ్వర్లు దంపతులు రిబ్బను కత్తిరించి జాతరను ప్రారంభించారు.
దుమ్ముగూడెం మార్చి 1: దుమ్ముగూడెం ముత్యాలమ్మ అమ్మవారి 21వ జాతర మహోత్సవాలు సోమవారం వైభవంగా మొదలయ్యాయి. సీఐ నల్లగట్ల వెంకటేశ్వర్లు దంపతులు రిబ్బను కత్తిరించి జాతరను ప్రారంభించారు. డప్పు వాయిద్యాలు, మేళతాళాలు, బాణసంచా పేలుళ్ల మధ్య సంప్రదాయ బద్ధంగా ఉదయం గ్రామ పొలిమేరలు కట్టగా, సాయంత్రం పుట్ట బంగారాన్ని తెచ్చారు. ఆలయంలో అఖండ దీపాన్ని వెలిగించడంతో జాతర ఉత్సవాలకు నాంది పడింది. ఉదయం ఇందల బుచ్చిరాజు కుటుంబ సభ్యులు, సాయంత్రం సీఐ నల్లగట్ల వెంకటేశ్వర్లు దంపతులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దుమ్ముగూడెం పీహెచ్సీ ఆద్వర్యంలో ఆలయం వద్ద వైద్యశిబిరాన్ని ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో కమిటీ చైర్మన్ అల్లాడి భాస్కరరావు, ఎంపీవో ముత్యాలరావు, వైద్యాధికారి బాలాజీనాయక్, కార్యదర్శి ప్రసాదరెడ్డి పాల్గొన్నారు.
Updated Date - 2021-03-02T05:18:54+05:30 IST