రుణాలను సద్వినియోగం చేసుకోవాలి
ABN, First Publish Date - 2021-06-23T04:55:21+05:30
కార్పొరేషన్ రుణాలను ఎస్సీలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా అదనపు కలెక్టర్ కర్నాటి వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు.
రుణాలను సద్వినియోగం చేసుకోవాలి
జిల్లా అదనపు కలెక్టర్ కర్నాటి వెంకటేశ్వర్లు
ఆంధ్రజ్యోతి, కొత్తగూడెం:
కార్పొరేషన్ రుణాలను ఎస్సీలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా అదనపు కలెక్టర్ కర్నాటి వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు. మంగళవారం కొత్తగూడెం డీఆర్డీఏ కార్యాలయంలో ఎస్సీ కార్పొరేషన్ రుణాల కోసం ఇంటర్వ్యూలను నిర్వహించారు. ఈ ఇంటర్వ్యూల్లో చైర్మ న్గా పాల్గొని అభ్యర్థుల ధృవపత్రాలను పరిశీలించి రుణాలను సద్వినియోగం చేసుకో వాలని సూచించారు. తొలి రోజు భద్రాచలం, దుమ్ముగూడెం, చర్ల, పినపాక, కరకగూడెం, మణుగూరు రూరల్, మునిసిపాలిటీ, అశ్వాపురం, బూర్గంపాడు ప్రాంతాల అభ్యర్థుల పా ల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూల్లో 747 మంది దరఖాస్తు చేసుకోగా, 107 మంది అభ్యర్థులు మా త్రమే హాజరైనట్లు సమాచారం. ఇంటర్వ్యూల్లో జిల్లా ఎస్సీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరక్టర్ ముత్యం, లీడ్ బ్యాంక్ మేనేజర్ శ్రీనివాస్, రవాణాశాఖ ఎంవీఐ శ్రీనివాసరావు, ఈజీఎస్, సెర్ప్, ఎస్సీ కార్పోరేషన్ అసిస్టెంట్ మేనేజర్ ఉపేందర్ రావు పాల్గొన్నారు.
Updated Date - 2021-06-23T04:55:21+05:30 IST