అభివృద్ధికి అందరూ సహకరించాలి: ఎమ్మెల్యే రాములు నాయక్
ABN, First Publish Date - 2021-04-21T05:12:32+05:30
మండలాన్ని అభివృద్ధి చేసే విషయంలో నాయకులు పార్టీలకు అతీతంగా సహకరిం చాలని,
జూలూరుపాడు, ఏప్రిల్ 20: మండలాన్ని అభివృద్ధి చేసే విషయంలో నాయకులు పార్టీలకు అతీతంగా సహకరిం చాలని, ఎలాంటి ద్వేషజాలాలకు వెళ్లవద్దు అని వైరా ఎమ్మె ల్యే లావుడ్యా రాములునాయక్ అన్నారు. మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 29 మంది లబ్దిదారులకు కళ్యాణలక్ష్మీ పథకం కింద ప్రభుత్వం రూ. 32 లక్షల చెక్కు లను మంజూరు చేసింది. మంగళవారం స్థానిక తహసీ ల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మె ల్యే పాల్గొని లబ్దిదారులకు చెక్కులను పంపిణీ చేశారు. అదేవిధంగా జూలూరుపాడులోని ప్రభుత్వ ఆసుప త్రిలో వైరా ఎమ్మెల్యే రాములునాయక్, ఆయన సతీమణి రాం బాయి కరోనా వ్యాక్సిన్ వేయించుకున్నారు. కేసీఆర్ కిట్ను ఎమ్మెల్యే మహిళకు అందజేశారు. అనంతరం ఆ యన మా ట్లాడుతూ సీఎం కేసీఆర్ పేదల కోసం అనేక స టంక్షేమ పథకాలను ప్రవేశ పెట్టారని, నిరుపేదలందరికి అవి అందే లా అధికారులు, ప్రజా ప్రతినిఽధులు కృషి చే యాలని కోరా రు. గర్భిణీలు ప్రభుత్వ ఆసుపత్రిలోనే కా న్పులు చేయిం చుకోవాలని అన్నారు. కరోనా వ్యాక్సిన్ వే యించుకునే విషయంలో ప్రజలు ఎలాంటి అపోహలకు గురి కావద్దు అని, నిర్భయంగా టీకాలు వేయించుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ లేళ్ళ వెంకటరెడ్డి, ఎంపీపీ లావుడ్యా సోనీ, జెడ్పీటీసీ భూక్యా కళావతి, తహసీల్దార్ లూదర్ విల్సన్, ఎంపీడీవో చంద్రశేఖర్, వైద్యాధికారి వీరబాబు, సీహెచ్వో వెంకటేశ్వరరావు, ఎంపీటీసీలు పెం డ్యాల రాజశేఖర్, దుద్దుకూరి మధుసుధన్రావు, బాణోత్ నీ ల, సర్పంచ్ పద్మ పాల్గొన్నారు.
Updated Date - 2021-04-21T05:12:32+05:30 IST