ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అప్పుల బాధతో రైతు ఆత్మహత్య

ABN, First Publish Date - 2021-10-11T05:17:41+05:30

వ్యవసాయం కోసం చేసిన అప్పులు పెరిగిపోవడం, ఈ క్రమంలోనే ఇంట్లో కలహాలు మొదలవడంతో మనస్తాపానికి గురైన ఓ రైతు ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఖమ్మం జిల్లా కామేపల్లి మండలం ముచ్చర్ల గ్రామంలో జరిగింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కామేపల్లి, అక్టోబరు 10 : వ్యవసాయం కోసం చేసిన అప్పులు పెరిగిపోవడం, ఈ క్రమంలోనే ఇంట్లో కలహాలు మొదలవడంతో మనస్తాపానికి గురైన ఓ రైతు ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఖమ్మం జిల్లా కామేపల్లి మండలం ముచ్చర్ల గ్రామంలో జరిగింది. ముచ్చర్ల గ్రామానికి చెందిన బత్తుల వీరన్న (50) తనకున్న ఎకరం 35కుంటల భూమిలో పంట వేసేందుకు రెండేళ్లుగా సుమారు రూ.3లక్షలు అప్పు చేశాడు. అయితే అనుకున్నంత రాబడి రాకపోవడంతో అప్పులు తీర్చే మార్గం కనిపించలేదు. ఇంతలోనే కుటుంబంలోనూ ఆర్థిక పరమైన కలహాలు మొదలయ్యాయి. దీంతో ఒత్తిడి భరించలేక వీరన్న శనివారం అర్ధరాత్రి ఇంట్లో ఎవరు లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి తండ్రి బత్తుల శ్రీను ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నామని కామేపల్లి ఎస్‌ఐ స్రవంతి తెలిపారు. మృతుడిుకి భార్య, కుమారుడు ఉన్నారు. 

Updated Date - 2021-10-11T05:17:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising