అప్పుల బాధతలో రైతు ఆత్మహత్య
ABN, First Publish Date - 2021-05-09T05:02:25+05:30
అప్పుల బాదతో పురుగుల మందు తాగి ఓ రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
రఘునాథపాలెం, మే 8: అప్పుల బాదతో పురుగుల మందు తాగి ఓ రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన మండల పరిఽధిలోని దోనబండలో శనివారం జరిగింది. ఎస్ఐ శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం దోనబండ గ్రామానికి చెందిన బాష్యం నరసింహారావు (45) తనకున్న రెండున్నర ఎకరాలతో పాటు మరికొంత భూమిని కౌలుకు తీసుకొని సాగుచేస్తున్నాడు. ఈ క్రమంలో వ్యవసాయంలో కొంత అప్పు చేశాడు. సరియైున దిగుబడి రాక, చేసిన అప్పులు తీర్చలేక మనస్థాపంతో శనివారం స్థానిక ప్రాథమిక పాఠశాల సమీపంలోని చెట్టుకింద పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. స్థానికులు గుర్తించి ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ నరసింహారావు మృతిచెందాడు. దీనిపై భార్య రాధమ్మ ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్టు ఎస్ఐ తెలిపారు.
Updated Date - 2021-05-09T05:02:25+05:30 IST