వైరా రిజర్వాయర్లో చేపల వేట 26న
ABN, First Publish Date - 2021-02-24T04:49:51+05:30
వైరా రిజర్వాయర్లో ఈనెల 26నుంచి చేపల వేటకు నిర్ణయం జరిగింది.
వైరా, ఫిబ్రవరి 23: వైరా రిజర్వాయర్లో ఈనెల 26నుంచి చేపల వేటకు నిర్ణయం జరిగింది. మంగళవారం వైరా మత్స్యశాఖ అభివృద్ధి అధికారి, చేపల సొసైటీ పర్సన్ ఇన్చార్జ్ జి.శివప్రసాద్ చేపల వేట అనుమతి ఆదేశాలను సభ్యులకు అందజేశారు. ఈ చేపల సొసైటీ మాజీ కార్యవర్గ సభ్యులు, మత్స్యకారుల సమక్షంలో అందించారు. ఎఫ్డీవో మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనల మేరకు చేపల వేట చేయాలని స్పష్టం చేశారు. 26వతేదీ తెల్లవారుజాము నుంచి చేపల వేట చేపట్టాలని స్పష్టం చేశారు. సంఘ సభ్యులు మాత్రమే రిజర్వాయర్లో చేపల వేటకు దిగాలని అలాకాకుండా ఇతరులు వేటకు దిగితే వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Updated Date - 2021-02-24T04:49:51+05:30 IST