వరిసాగుపై ఆంక్షలు వద్దు
ABN, First Publish Date - 2021-10-29T05:39:03+05:30
రాష్ట్రంలో వరిసాగు వద్దని, ప్రభుత్వం ఆంక్షలు విధిస్తుందని ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా బీజేపీ ఆధ్వర్యంలో ఖమ్మం ఆర్అండ్బీ విశ్రాంతిగృహం వద్ద బీజేపీ నాయకులు, కార్యకర్తలు ప్రభుత్వ దిష్టి బొమ్మ దహనం చేస్తుండగా పోలీసులు అడ్డుకున్నారు.
ఖమ్మంలో బీజేపీ ఆందోళన
ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేసే ప్రయత్నంలో అరెస్టు
ఖమ్మం,అక్టోబరు 28(ప్రతినిధి): రాష్ట్రంలో వరిసాగు వద్దని, ప్రభుత్వం ఆంక్షలు విధిస్తుందని ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా బీజేపీ ఆధ్వర్యంలో ఖమ్మం ఆర్అండ్బీ విశ్రాంతిగృహం వద్ద బీజేపీ నాయకులు, కార్యకర్తలు ప్రభుత్వ దిష్టి బొమ్మ దహనం చేస్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. అనంతరం బీజేపీ జిల్లా అధ్యక్షుడు గల్లా సత్యనారాయణ, కిసాన్మోర్చా జిల్లా అధ్యక్షుడు చావా కిరణ్తో పాటు పలువురు నాయకులను పోలీసులు అరెస్టచేసి ఆ తర్వాత వ్యక్తిగత పూచీ కత్తుపై విడుదల చేశారు. రైతుల పక్షాన భారతీయ జనతాపార్టీ అండగా ఉంటుం దని, బీజేపీ జిల్లా అధ్యక్షుడు గల్లా సత్యనారాయణ పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణలోని కొన్ని జిల్లాల కలెక్టర్లకూడా రైతులకు వరివిత్తనాలు సరఫరా చేస్తే షాపులపై కేసులు నమోదుచేస్తామంటూ ఇబ్బందులకు గురిచేస్తున్నారని, వరిసాగుచేస్తే ఉరితప్పదంటూ ప్రచారం నిర్వహించడం, ఇటువంటి చర్యలు బాధకరమన్నారు. వరి రైతులపై ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తోందని, రైతులు పండించిన ధాన్యాన్ని కేంద్రప్రభుత్వం కొనుగోలు చేసేందుకు సిద్ధంగా ఉన్నా రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు.
Updated Date - 2021-10-29T05:39:03+05:30 IST