ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అడ్డగూడూరు పీఎస్‌లో కస్టోడియల్ డెత్ బాధాకరం: డీజీపీ

ABN, First Publish Date - 2021-06-27T18:44:03+05:30

యాదాద్రి జిల్లా అడ్డగూడూరు పోలీస్ స్టేషన్‌లో కస్టోడియల్ డెత్ బాధాకరమని డీజీపీ మహేందర్ రెడ్డి అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఖమ్మం: యాదాద్రి జిల్లా అడ్డగూడూరు పోలీస్ స్టేషన్‌లో కస్టోడియల్ డెత్ బాధాకరమని డీజీపీ మహేందర్ రెడ్డి అన్నారు. ఆదివారం లాకప్‌డెత్‌లో మరణించిన మరియమ్మ కుమారుడిని డీజీపీ కలిసి పరామర్శించి..ప్రభుత్వ సాయాన్ని అందజేశారు. అనంతరం డీజీపీ మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ... మరియమ్మ కస్టోడియల్ డెత్‌పై పూర్తి స్థాయిలో విచారణ జరుపుతున్నామని తెలిపారు. మరోసారి ఇటువంటి సంఘటనలు భవిష్యత్తులో జరగకుండా మరింత కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ప్రజల ఆత్మగౌరవాన్ని కాపాడే విధంగా తెలంగాణలో ప్రెండ్లి పోలీసింగ్ నిర్వహిస్తున్నారన్నారు. ఈ ఘటనతో రాష్ట్ర వ్యాప్తంగా పోలీసుల అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారని ఆయన తెలిపారు. ఇటువంటి సంఘటనలు భవిష్యత్తులో పునరావృతం కాకుండా పోలీస్ అధికారులు ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. ఈ ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి బాధ్యులపై అన్ని రకాల చర్యలు తీసుకుంటామని తెలిపారు. మరియమ్మ కుటుంబానికి అండగా ఉంటామని... ప్రభుత్వం తరపున సహాయం అందజేశామని డీజీపీ మహేందర్‌రెడ్డి పేర్కొన్నారు.

Updated Date - 2021-06-27T18:44:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising