ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భూమి వివరాలు ఆన్లైన్లో లేవని ఆందోళన

ABN, First Publish Date - 2021-09-04T04:33:26+05:30

తన భూమి ఆనలైనలో కన్పించటం లేదని ఓ రైతు తన ఇద్దరు కూతుళ్లతో కలిసి ముదిగొండ రెవెన్యూ కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహించిన సంఘటన శుక్రవారం చోటుచేసుకుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముదిగొండ, సెప్టెంబరు 3: తన భూమి ఆనలైనలో కన్పించటం లేదని ఓ రైతు తన ఇద్దరు కూతుళ్లతో కలిసి ముదిగొండ రెవెన్యూ కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహించిన సంఘటన శుక్రవారం చోటుచేసుకుంది. ఖమ్మం రూరల్‌ మండలం గుదిమళ్ల గ్రామానికి చెందిన ఎమిక వెంకటేశ్వర్లుకు ముదిగొండ మండలం పండ్రేగుపల్లి రెవెన్యూలోని ఖాతానెంబర్‌ 460లోని సర్వేనెంబర్‌ 15/అ/4/1, 15/అ1లో  రెండెకరాల 20కుంటల భూమి ఉంది. భూమికి పట్టాదారు పాస్‌పుస్తకం ఉన్నప్పటికీ ఆనలైనలో మాత్రం కనిపించన చెందాడు. రెండేళ్లుగా ఆర్డీవో, అదనపు కలెక్టర్‌, కలెక్టర్‌ దృష్టికి తన సమస్యను తీసుకువెళ్లినప్పటికీ పరిష్కారం కాలేదు. దీంతో శుక్రవారం రైతు వెంకటేశ్వర్లు తన ఇద్దరు కూతుళ్లతో కలిసి రెవెన్యూ కార్యాలయంకు వచ్చి తన భూమిని ఆనలైనలో ఎక్కించాలంటూ ఆందోళన చేశాడు. తహసీల్దార్‌ తహసీల్దార్‌ శ్రీనివాస్‌ను తన సమస్య పరిష్కరించమని కోరగా తనకు సంబంధం లేదన్నారు. దీంతో రైతుల ఆందోళనకు దిగడంతో నాయబ్‌ తహసీల్దార్‌ కరుణాకర్‌రెడ్డి కలెక్టర్‌ దృష్టికి తీసుకువెళ్లి సమస్యను పరిష్కరించేలా చూస్తానని చెప్పారు. దీంతో ఎస్‌ఐ నరేష్‌ రైతుతో మాట్లాడి ఆందోళన విరమింపజేశారు. 

Updated Date - 2021-09-04T04:33:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising