స్నాన ఘట్టాలు శుభ్రం చేశారు
ABN, First Publish Date - 2021-10-15T06:09:37+05:30
భద్రాచలంలోని గోదావరి ఒడ్డున స్నాన ఘట్టాలను శుభ్రం చేయడంతో పాటు పరిసరాల్లో గ్రామపంచాయతీ కార్మికులు పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహించారు.
ఆంధ్రజ్యోతి కథనానికి స్పందించిన అధికారులు
భద్రాచలం, అక్టోబరు 14: భద్రాచలంలోని గోదావరి ఒడ్డున స్నాన ఘట్టాలను శుభ్రం చేయడంతో పాటు పరిసరాల్లో గ్రామపంచాయతీ కార్మికులు పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహించారు. ఈ నెల 10న ఆంధ్రజ్యోతి పత్రికలో అపరిశుభ్రంగా గోదావరి స్నాన ఘట్టాలు అనే శీర్షికన వార్త ప్రచురితమైంది. దీంతో స్పందించిన అధికారులు గురువారం స్నానఘట్టాలను అడిషనల్ కలెక్టర్ వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో శుభ్రం చేశారు. అలాగే పరిసరాల్లో ఉన్న చెత్తా చెదారం, వ్యర్ధ పదార్దాలను గ్రామ పంచాయతీ అధికారులు తొలగించారు
Updated Date - 2021-10-15T06:09:37+05:30 IST