ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

27న పెంచికల్‌పేటలో కేసీఆర్‌ బహిరంగ సభ

ABN, First Publish Date - 2021-10-20T08:49:24+05:30

27న పెంచికల్‌పేటలో కేసీఆర్‌ బహిరంగ సభ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి హరీశ్‌ రావు 

హైదరాబాద్‌, ఎల్కతుర్తి, అక్టోబరు 19 (ఆంధ్రజ్యోతి): హుజూరాబాద్‌ ఉప ఎన్నికలకు సంబంధించి ఈనెల 27న హుస్నాబాద్‌ నియోజకవర్గం పరిధిలోని ఎల్కతుర్తి మండలం పెంచికల పేటలో సీఎం కేసీఆర్‌ బహిరంగ సభకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఎన్నికల నిబంధనల ప్రకారం హుజూరాబాద్‌ నియోజకవర్గంలో భారీ బహిరంగ సభలను నిర్వహించుకునేందుకు వీలుకాక పోవడంతో టీఆర్‌ఎస్‌ అధినాయకత్వం ఈ మార్గాన్ని ఎంచుకుంది. సీఎం కేసీఆర్‌ను టీఆర్‌ఎస్‌ అధ్యక్షునిగా ఈ నెల 25న జరగనున్న పార్టీ ప్లీనరీలో ప్రకటించనున్నారు. దీన్ని పురస్కరించుకుని పెంచికల పేట సభను నిర్వహించనున్నారు. ఎన్నికల ప్రచార గడువు ఆ రోజుతోనే ముగుస్తుండడం గమనార్హం. సభాస్థలిని మంగళవారం మంత్రి హరీశ్‌ రావు, హుస్నాబాద్‌ ఎమ్మెల్యే సతీశ్‌ కుమార్‌, హుజూరాబాద్‌ టీఆర్‌ఎస్‌ అభ్యర్థి గెల్లు శ్రీనివా్‌సయాదవ్‌ తదితరులు పరిశీలించారు. ఈ సందర్భంగా సతీశ్‌ కుమార్‌ మాట్లాడుతూ సభకు సుమారు లక్షన్నర మంది హాజరు కానున్నట్లు పేర్కొన్నారు. 


Updated Date - 2021-10-20T08:49:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising