ఈటలను పెంచి పెద్ద చేసింది కేసీఆరే: హరీశ్రావు
ABN, First Publish Date - 2021-10-10T00:39:56+05:30
రానున్న రోజుల్లో పేదలందరికీ దళితబంధు తరహాలో సాయం అందజేస్తామని మంత్రి హరీశ్రావు ప్రకటించారు.
ఇల్లందకుంట: రానున్న రోజుల్లో పేదలందరికీ దళితబంధు తరహాలో సాయం అందజేస్తామని మంత్రి హరీశ్రావు ప్రకటించారు. శనివారం కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండలంలో గెల్లు శ్రీనివాస్యాదవ్తో కలిసి ఎన్నికల ప్రచారంలో హరీశ్రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్రావు మాట్లాడుతూ ఈటల రాజేందర్ను పెంచి పెద్ది చేసింది సీఎం కేసీఆరేనని తెలిపారు. కాని ఈటల మాత్రం తల్లి పాలు తాగి రొమ్ము గుద్దినట్లు చేశాడని దుయ్యబట్టారు. బీజేపీ పెట్రోల్, డీజిల్ ధరలను వంద రూపాయలు దాటించిందని, గ్యాస్ ధరను వెయ్యి రూపాయలకు పెంచిందని హరీశ్రావు విమర్శించారు.
Updated Date - 2021-10-10T00:39:56+05:30 IST