కేసీఆర్ ఫామ్హౌస్లోని బావిలో మృతదేహం
ABN, First Publish Date - 2021-12-23T00:55:54+05:30
సీఎం కేసీఆర్ వ్యవసాయ క్షేత్రంలోని బావిలో యువకుడి మృతదేహం బుధవారం లభ్యమైంది. సిద్దిపేట జిల్లా మార్కుక్ మండలం ఎర్రవల్లిలోని సీఎం కేసీఆర్ ఫామ్హౌస్లో
జగదేవపూర్: సీఎం కేసీఆర్ వ్యవసాయ క్షేత్రంలోని బావిలో యువకుడి మృతదేహం బుధవారం లభ్యమైంది. సిద్దిపేట జిల్లా మార్కుక్ మండలం ఎర్రవల్లిలోని సీఎం కేసీఆర్ ఫామ్హౌస్లో మంగళవారం కూలి పనులకు వెళ్లిన వరదరాజుపురం గ్రామానికి చెందిన రెడ్డమైన ఆంజనేయులు కాలుజారి బావిలో పడ్డాడు. కాగా మృతదేహం కోసం మంగళవారం రాత్రివరకు గాలించినా దొరకలేదు. బుధవారం గజ ఈతగాళ్లు గాలింపు చేపట్టగా మధ్యాహ్నం మృతదేహం దొరికింది. కాగా ఆంజనేయులు కుటుంబ సభ్యులను ఫామ్హౌస్లోకి అధికారులు అనుమతించలేదు. ఆంజనేయులు మృతదేహానికి వ్యవసాయ క్షేత్రంలోనే వైద్యులచే పోస్టుమార్టం నిర్వహించారు. మృతదేహాన్ని వ్యవసాయ క్షేత్రం నుంచి ప్రత్యేక వాహనంలో వరదరాజుపురానికి తీసుకువెళ్లి కుటుంబ సభ్యులకు అప్పగించారు. మృతుని కుటుంబానికి రూ. ఏడున్నర లక్షల పరిహారం ఇచ్చినట్లు తెలిసింది.
Updated Date - 2021-12-23T00:55:54+05:30 IST