భార్య కరోనాతో.. భర్త గుండెపోటుతో మృతి
ABN, First Publish Date - 2021-05-17T05:38:24+05:30
భార్య కరోనాతో.. భర్త గుండెపోటుతో మృతి
ఒకే రోజు ఇద్దరు మృతితో ముల్కనూర్లో విషాదం
భీమదేవరపల్లి, మే 16 : భీమదేవరపల్లి మండలం ముల్కనూర్లో భార్య కరోనాతో మృతి చెందగా, భర్త గుండెపోటుతో మృతి చెందాడు. ఆదివారం ఒకే రోజు భార్యాభర్తలు మృతి చెందడంతో విషాదం అలుముకుంది. ముల్కనూర్కు చెందిన గున్ను నర్మద(52) కొన్ని రోజులుగా కరోనా వ్యాధితో బాధపడుతోంది. ఆదివారం ఉదయం చికిత్స పొందుతూ నర్మద మృతి చెందింది. నర్మద అంత్యక్రియలు పూర్తి కాగానే నర్మద భర్త రాజు(56)కు గుండెపోటు వ చ్చింది. వెంటనే వరంగల్కు చికిత్స నిమిత్తం తరలించగా రాజు మృతి చెందాడు. సాయంత్రం రాజు అంత్యక్రియలు నిర్వహించారు. ఒకేరోజు భార్యాభర్తలు ఇద్దరు మృతి చెంది అంత్యక్రియలు నిర్వహించడంతో ముల్కనూర్లో విషాదఛాయలు అలుముకున్నాయి. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు.
Updated Date - 2021-05-17T05:38:24+05:30 IST