దళితుడిపై దాడి చేసిన వారిని శిక్షించాలి
ABN, First Publish Date - 2021-06-23T06:15:48+05:30
మండలంలోని బావుసాయిపేటకు చెందిన దళితుడు బొడ్డు భూమయ్యపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని దళిత లిబరేషన్ రాష్ట్ర కార్యదర్శి మార్వాడి సుదర్శన్ అన్నారు.
కోనరావుపేట, జూన్ 22: మండలంలోని బావుసాయిపేటకు చెందిన దళితుడు బొడ్డు భూమయ్యపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని దళిత లిబరేషన్ రాష్ట్ర కార్యదర్శి మార్వాడి సుదర్శన్ అన్నారు. దళితుడు బొడ్డు భూమయ్యపై దాడిని నిరసిస్తూ బావుసాయిపేట గ్రామ కార్యదర్శికి దళిత సంఘాల ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కూలీపని కోసం వెళ్లిన భూమయ్యను తీవ్రంగా కొట్టడం బాధాకరమన్నారు. కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి ఎరవెల్లి నాగరాజు, మాల సంఘం జిల్లా కార్యదర్శి ప్రశాంత్, ప్రదీప్కుమార్, హరీష్, దేవరాజు, స్వామి ఉన్నారు.
Updated Date - 2021-06-23T06:15:48+05:30 IST