రాజన్న క్షేత్రంలో భక్తుల సందడి
ABN, First Publish Date - 2021-08-14T06:33:33+05:30
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజరాజేశ్వర క్షేత్రం శుక్రవారం భక్తులతో సందడిగా మారింది. శ్రావణమాసం తొలి శుక్రవారం సందర్భంగా వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులు వేములవాడకు తరలివచ్చారు.
- అమ్మవారికి శ్రావణమాస పూజలు
వేములవాడ, ఆగస్టు 13 : రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజరాజేశ్వర క్షేత్రం శుక్రవారం భక్తులతో సందడిగా మారింది. శ్రావణమాసం తొలి శుక్రవారం సందర్భంగా వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులు వేములవాడకు తరలివచ్చారు. తమ ఇష్టదైవమైన రాజరాజేశ్వరస్వామివారిని, రాజరాజేశ్వరీ దేవి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా భక్తులు ఆలయ కల్యాణకట్టలో తలనీలాలు సమర్పించారు. స్వామివారికి ప్రీతిపాత్రమైన కోడెమొక్కు చెల్లించుకున్నారు. శ్రావణ శుక్రవారం సందర్భంగా ప్రధాన ఆలయంలో రాజరాజేశ్వరీదేవి అమ్మవారికి ఉదయం, సాయంత్రం ఆలయ స్థానాచార్యులు అప్పాల భీమాశంకర్ నేతృత్వంలో అర్చకులు చతుష్టష్టి ఉపచారములతో విశేష పూజలు నిర్వహించారు. సాయంత్రం ఛాయనక్త సమయాన మహాలక్ష్మీ దేవాలయంలో అమ్మవారికి షోడషోపచార పూజలు చేశారు. మహాలక్ష్మీ అమ్మవారిని కూడా భక్తులు పెద్ద సంఖ్యలో దర్శించుకున్నారు.
Updated Date - 2021-08-14T06:33:33+05:30 IST