రాజరాజేశ్వరస్వామివారికి రుద్రాభిషేకం
ABN, First Publish Date - 2021-05-17T06:10:13+05:30
వేములవాడ రాజరాజేశ్వర క్షేత్రంలో ఆరుద్ర నక్షత్రోత్సవం సందర్భంగా స్వామివారికి ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు.
- కొనసాగుతున్న శంకర జయంతి ఉత్సవాలు
వేములవాడ, మే 16 : వేములవాడ రాజరాజేశ్వర క్షేత్రంలో ఆరుద్ర నక్షత్రోత్సవం సందర్భంగా స్వామివారికి ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ స్థానాచార్యులు అప్పాల భీమాశంకర్ నేతృత్వంలో అర్చకులు కొవిడ్ నిబంధనలు పాటిస్తూ ఉదయం రాజరాజేశ్వరస్వామివారికి మహన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, అనంతరం పరివార దేవతార్చనలు నిర్వహించారు. శంకర జయంతి ఉత్సవాల్లో భాగంగా స్వామివారి కల్యాణమండంలో శంకరాచార్యుల చిత్రపటం వద్ద అర్చకులు ఉదయం పంచోపనిషత్ ద్వారా మహాభిషేకం, పరివార దేవతలకు అర్చనలు వంటి కార్యక్రమాలు చేపట్టారు. శంకర విజయం పురాణ ప్రవచనం గావించారు.
Updated Date - 2021-05-17T06:10:13+05:30 IST