ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కార్మికులకు సొంతింటి కోసం సీఐటీయూ ఆధ్వర్యంలో పోరాటం

ABN, First Publish Date - 2021-11-06T05:27:59+05:30

సింగరేణి కార్మికులకు సొంతింటి నిర్మాణం కోసం సీఐటీయూ ఆధ్వర్యంలో పోరాటం నిర్వహించనున్నట్టు సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు తుమ్మల రాజిరెడ్డి తెలిపారు.

గేట్‌ మీటింగ్‌లో మాట్లాడుతున్న తుమ్మల రాజారెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- రాష్ట్ర అధ్యక్షుడు తుమ్మల రాజారెడ్డి

గోదావరిఖని, నవంబరు 5: సింగరేణి కార్మికులకు సొంతింటి నిర్మాణం కోసం సీఐటీయూ ఆధ్వర్యంలో పోరాటం నిర్వహించనున్నట్టు సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు తుమ్మల రాజిరెడ్డి తెలిపారు. శుక్రవారం ఆర్‌జీ-1 పరిధిలోని జీడీకే 2ఏ ఇంక్లైన్‌ బొగ్గుగని జరిగిన గేట్‌ మీటింగ్‌లో ఆయన మాట్లాడుతూ సింగరేణి లో 30ఏళ్లు పనిచేసిన కార్మికులకు ఇంటిస్థలం లేదని, వారికి యాజమాన్యమే 250చదరపు గజాల ఇంటిస్థలాన్ని కేటాయించాలన్నారు. రామగుండంలో గుంట జాగ కొనుక్కోవాలన్నా కార్మికులు కొనలేని పరిస్థితి అని, 30 ఏళ్లు సంస్థలో పని చేసి పదవీవిరమణ పొందిన తరువాత వారికి రూ.60లక్షలు కూడా రావడం లేదని, కార్మికులకు సొంతింటి కోసం 250చదరపు గజాల స్థలాన్ని కేటాయించాలని సీఐటీయూ పోరాటం చేయనున్నట్టు, కార్మికునికి ఇంటి స్థలంతో పాటు డ బుల్‌ బెడ్‌రూమ్‌ క్వార్టర్స్‌ను ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఆర్‌జీ-1 బ్రాంచ్‌ కార్యదర్శి బూరుగుల రాములు అధ్యక్షతన జరిగిన ఈ గేట్‌ మీటింగ్‌లో మెండె శ్రీనివాస్‌, యాదగిరి, ఆత్మకూరి రాజయ్య పాల్గొన్నారు.

Updated Date - 2021-11-06T05:27:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising