రైతు వ్యతిరేక చట్టాలు రద్దు చేసే వరకు పోరాటం ఆగదు
ABN, First Publish Date - 2021-01-27T05:35:19+05:30
రైతు వ్యతిరేక చట్టాలు రద్దు చేసే వరకు పోరాటం ఆగదని, సీపీఐ, సీపీఎం జిల్లా కార్యదర్శులు పొనగంటి కేదారి, గీట్ల ముకుందరెడ్డి అన్నారు.
వామపక్షాల ఆధ్వర్యంలో ట్రాక్టర్ ర్యాలీ
భగత్నగర్, జనవరి 26: రైతు వ్యతిరేక చట్టాలు రద్దు చేసే వరకు పోరాటం ఆగదని, సీపీఐ, సీపీఎం జిల్లా కార్యదర్శులు పొనగంటి కేదారి, గీట్ల ముకుందరెడ్డి అన్నారు. మంగళవారం కరీంనగర్లో వామపక్షాలు, రైతు సంఘాల ఆధ్వర్యంలో రైతులకు మద్దతుగా ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతాంగానికి నష్టం కలిగించే చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కరీంనగర్లోని కోతిరాంపూర్లోని ఎన్టీఆర్ విగ్రహం నుంచి ప్రారంభమైన ర్యాలీ కమాన్ చౌరస్తా, లక్ష్మీనగర్, కాపువాడ, హౌసింగ్బోర్డుకాలనీ మీదుగా బద్దం ఎల్లారెడ్డి విగ్రహం వరకు సాగింది. కార్యక్రమంలో జిల్లా సహాయ కార్యదర్శి కొయ్యడ సృజన్కుమార్, రైతు సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు, మిల్కూరి వాసుదేవరెడ్డి, వర్ణ వెంకటరెడ్డి, అందెస్వామి, బామండ్ల రవీందర్, బోయిని అశోక్, కసిరెడ్డి సురేందర్రెడ్డి, యు శ్రీనివాస్, ఎడ్ల రమేష్, కటికరెడ్డి బుచ్చన్న యాదవ్, టేకుమల్ల సమ్మయ్య, వి రాజు, బీమా సాహేబ్, మణికంఠరెడ్డి, శనిగరపు రజనీకాంత్, యుగేందర్ పాల్గొన్నారు.
Updated Date - 2021-01-27T05:35:19+05:30 IST