ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పటిష్టంగా లాక్‌డౌన్‌

ABN, First Publish Date - 2021-05-15T05:45:10+05:30

జిల్లాలో లాక్‌డౌన్‌ను పోలీసులు పటిష్టంగా అమలు చేస్తున్నారు. మొదటి రెండు రోజులు పోలీసులు కొంత చూసీచూడనట్లు వ్యవహరించగా శుక్రవారం మూడో రోజు కఠినంగానే వ్యవహరించారు.

లాక్‌డౌన్‌తో నిర్మానుష్యంగా కమాన్‌ సర్కిల్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 10 గంటలకు మూతపడ్డ దుకాణాలు 

- నిర్మానుష్యంగా రోడ్లు, వీధులు 

కరీంనగర్‌ టౌన్‌, మే 12: జిల్లాలో లాక్‌డౌన్‌ను పోలీసులు పటిష్టంగా అమలు చేస్తున్నారు. మొదటి రెండు రోజులు పోలీసులు కొంత చూసీచూడనట్లు వ్యవహరించగా  శుక్రవారం మూడో రోజు కఠినంగానే వ్యవహరించారు. ఉదయం 6 నుంచి 10 గంటల వరకు అన్ని వ్యాపార సంస్థలను తెరచి ఉంచడంతో ప్రజలు ఒక్కసారిగా రోడ్లపైకి వచ్చి వారికి అవసరమైన వస్తువులు, కూరగాయలు కొన్నారు. నిన్నమొన్నటి వరకు 11 గంటల వరకు కొన్ని దుకాణాలు తెరచి ఉంచడం, రోడ్లపై తిరుగడం కనిపించినా పోలీసులు వారికి అవగాహన కల్పించి మూసివేయించారు. శుక్రవారం 10 గంటల నుంచి కచ్చితంగా లాక్‌డౌన్‌ నిబంధనలను అమలులోకి తెచ్చారు. తెరచి ఉంచిన వ్యాపార సంస్థలను మూసివేసి తీవ్రస్థాయిలో హెచ్చరించారు. ఓవైపు లాక్‌డౌన్‌ మరోవైపు రంజాన్‌ సెలవు దినం కావడంతో రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. కొవిడ్‌ పరీక్షా కేంద్రాలు, వ్యాక్సినేషన్‌ కేంద్రాలకు ప్రజలు ఎక్కువగా వెళ్లలేదు. ఆర్టీసీ సంస్థ కరీంనగర్‌ రీజియన్‌ పరిధిలోని వివిధ డిపోల ద్వారా ఉదయం 6 నుంచి 10 గంటల వరకు 100 బస్సులను నడిపించింది. పెట్రోల్‌బంకులు యధావిధిగా పనిచేశాయి. 

 

Updated Date - 2021-05-15T05:45:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising