ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కేటీఆర్ నియోజకవర్గంలో రైతుల ఆత్మహత్యలు సిగ్గు చేటు: షర్మిల

ABN, First Publish Date - 2021-12-21T18:14:57+05:30

మంత్రి కేటీఆర్ నియోజకవర్గంలో రైతుల ఆత్మహత్యలు చేసుకోవడం సిగ్గు చేటని షర్మిల విమర్శించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాజన్న సిరిసిల్ల జిల్లా: మంత్రి కేటీఆర్ నియోజకవర్గంలో రైతుల ఆత్మహత్యలు చేసుకోవడం సిగ్గు చేటని వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు షర్మిల విమర్శించారు. రైతు ఆవేదన యాత్రలో భాగంగా ఆమె రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటిస్తున్నారు. గంభీరావు పేటలో షర్మిల మాట్లాడుతూ కేటీఆర్‌కు కనీసం ఇంగిత జ్ఞానం లేదని, రైతులకు పంట నష్ట పరిహారం కూడా ఇవ్వడం లేదని తీవ్రస్థాయిలో విమర్శించారు. రుణమాఫీ ఇంకా ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించారు. అధికారం అనుభవిస్తే సరిపోదని బుద్ధి, సిగ్గు ఉండాలన్నారు. 


సీఎం కేసీఆర్ రైతు ద్రోహి అని, రైతుల ఆత్మహత్యలకు ముఖ్యమంత్రే కారణమని షర్మిల ఆరోపించారు. వరి వద్దని చెప్పే అధికారం సీఎంకు లేదన్నారు. మద్దతు ధర ఉన్న పంటలనే రైతు పండిస్తారని, వరి వద్దన్న ముఖ్యమంత్రి మనకు వద్దన్నారు. కేసీఆర్ సీఎంగా పనికి రారని, చావు డప్పు కేసీఆర్‌కు, ఆయన ప్రభుత్వానికి కొట్టాలన్నారు. ఇవి ఆత్మహత్యలు కావని, కేసీఆర్ చేసిన హత్యలని వైఎస్ షర్మిల అన్నారు.

Updated Date - 2021-12-21T18:14:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising