ఫిర్యాదులపై వెంటనే స్పందించాలి
ABN, First Publish Date - 2021-01-17T05:38:11+05:30
ఫిర్యాదులపై వెంటనే స్పందించాలని ఎస్పీ రాహుల్హెగ్డే అన్నారు. శనివారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన నేర సమీక్షలో మాట్లాడారు.
- ఎస్పీ రాహుల్హెగ్డే
సిరిసిల్ల క్రైం, జనవరి 16: ఫిర్యాదులపై వెంటనే స్పందించాలని ఎస్పీ రాహుల్హెగ్డే అన్నారు. శనివారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన నేర సమీక్షలో మాట్లాడారు. ప్రజల్లో పోలీసులకు మంచి గుర్తింపు రావాలన్నారు. శాంతిభద్రతలు, నేరాల అదుపునకు చర్యలు తీసుకోవాలన్నారు. కేసుల పరిశోధనలో పురోగతి సాధించాలన్నారు. సీఐల వద్ద ఉన్న పెండింగ్ ఓఈలను త్వరగా పూర్తిచేయాలన్నారు. కోర్టులో చార్జి షీట్ ఎంట్రీ చేయాలన్నారు. డయల్ 100 కాల్స్పై వేగవంతంగా స్పందించాలన్నారు. కమ్యునిటీ పోలిసింగ్లో భాగంగా కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజలకు మరింత చేరువ కావాలన్నారు. సమావేశంలో సిరిసిల్ల, వేములవాడ డీఎస్పీలు పి. చంద్రశేఖర్, చంద్రకాంత్, సీఐలు వెంకటనర్సయ్య, సర్వర్పాష, బన్సీలాల్, వెంకటేశ్, నవీన్కుమార్, మొగిలి, ఎస్బిఐ శ్రీనివాస్, డీసీఆర్బి సీఐ శ్రీలత, ఎస్సైలు పాల్గొన్నారు.
Updated Date - 2021-01-17T05:38:11+05:30 IST