మద్దతు కోసం శ్రీధర్బాబును కలిసిన రవీందర్సింగ్
ABN, First Publish Date - 2021-11-29T06:01:03+05:30
కరీంనగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న రవీందర్సింగ్ హైదరాబాద్లో మాజీ మంత్రి, మంథ ని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్బాబు ఆదివారం మర్యాద పూర్వకంగా కలవడం రాజకీయంగా చర్చనీయాం శంగా మారింది.
మంథని, నవంబర్ 28: కరీంనగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న రవీందర్సింగ్ హైదరాబాద్లో మాజీ మంత్రి, మంథ ని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్బాబు ఆదివారం మర్యాద పూర్వకంగా కలవడం రాజకీయంగా చర్చనీయాం శంగా మారింది. ఎన్నికల్లో పోటీ చేస్తున్న తనకు మద్దతు ఇవ్వాలని శ్రీధర్బాబును రవీందర్ సింగ్ కోరారు. నిన్నటివరకు అధికార టీఆర్ఎస్ పార్టీ నేతగా ఉన్న రవీందర్సింగ్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తిరుగుబాటు జెండా ఎగురవేసి ప్రతిపక్ష పార్టీ నాయకుడిగా ఉన్న శ్రీధర్బాబును కలిసి మద్దతు కోరడం అన్ని రాజకీయ పార్టీల్లో చర్చనీయాంశంగా మారింది. ఆయన వెంట మాజీ కార్పొరేటర్ సాదవేన శ్రీనివాస్, ఎంపీటీసీ నిర్ల నర్సింగారావులు పాల్గొన్నారు.
Updated Date - 2021-11-29T06:01:03+05:30 IST