ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తెలంగాణలోని ఈ ప్రాంతంలో మళ్లీ Lockdown..

ABN, First Publish Date - 2021-12-23T16:39:06+05:30

తెలంగాణలోని ఈ ప్రాంతంలో మళ్లీ Lockdown..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • రాజన్న సిరిసిల్ల జిల్లాలో మళ్ళీ..
  • మొదలైన లాక్ డౌన్

రాజన్న సిరిసిల్ల: జిల్లాలో మళ్ళీ లాక్ డౌన్ మొదలైంది. ముస్తాబాద్ మండలం గూడెం గ్రామంలో ప్రజలు సెల్ఫ్ లాక్ డౌన్ ప్రకటించారు. ఇటీవల దుబాయ్ నుంచి గూడెం తన స్వంత  గ్రామానికి వచ్చిన వ్యక్తికి ఒమైక్రాన్ నిర్దారణ అయింది. తాజాగా అతని తల్లి, భార్యకు కూడా కరోనా పాజిటివ్ నిర్దారణ అయింది. దీంతో గ్రామంలో 10 రోజుల పాటు లాక్ డౌన్ విధించారు. ఎల్లారెడ్డి పేట మండలం, నారాయణపురంలో ఓ శుభకార్యంలో బాధితుడు పాల్గొన్నాడు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న 53 మంది నమూనాలను వైద్యాధికారులు సేకరించి, వారిని ఇళ్ళ నుంచి బయటకు రావద్దని ఆదేశించారు.


ఇదిలా ఉంటే.. రాష్ట్రంలో నిన్న (బుధవారం) ఒక్కరోజే మరో 14 ఒమైక్రాన్‌ కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. నమూనాల జన్యు విశ్లేషణ అనంతరం వీరికి కొత్త వేరియంట్‌ నిర్ధారణ అయినట్లు పేర్కొంది. ఇందులో 12 మంది ముప్పు జాబితాలో లేని దేశాల నుంచి వచ్చినవారే. ఇప్పటివరకు రాష్ట్రంలో నమోదైన మొత్తం ఒమైక్రాన్‌ కేసుల సంఖ్య 38కి పెరిగింది.

Updated Date - 2021-12-23T16:39:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising