Telangana: చేపల వేటకు వెళ్లి వ్యక్తి గల్లంతు
ABN, First Publish Date - 2021-10-11T13:55:06+05:30
జిల్లాలోని ఇల్లంతకుంట మండలం వెల్జిపూర్ గ్రామానికి చెందిన సొనవేని రేణయ్య(30) అనే యువకుడు మధ్యమానేరులో ఆదివారం చేపల వేటకు వెళ్లి గల్లంతయ్యాడు.
రాజన్న సిరిసిల్ల: జిల్లాలోని ఇల్లంతకుంట మండలం వెల్జిపూర్ గ్రామానికి చెందిన సొనవేని రేణయ్య(30) అనే యువకుడు మధ్యమానేరులో ఆదివారం చేపల వేటకు వెళ్లి గల్లంతయ్యాడు. సోమవారం తెల్లవారుజామున మృతదేహాం నీటిపై తేలింది. వెంటనే మృతదేహాన్ని కుటుంబ సభ్యులు బయటకు తీశారు. రేణయ్య మృతితో కుటుంబంలో విషాదఛాయలు అలముకున్నాయి.
Updated Date - 2021-10-11T13:55:06+05:30 IST