రోడ్ల దుస్థితిపై నగర కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిరసన
ABN, First Publish Date - 2021-07-25T05:52:22+05:30
నగరంలో రోడ్ల దుస్థితిపై నగర కాంగ్రెస్ అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్రెడ్డి ఆధ్వర్యంలో శనివారం పద్మనగర్లో రోడ్డుపై నాట్లువేసి నిరసన వ్యక్తం చేశారు.
కరీంనగర్ అర్బన్, జూలై 24: నగరంలో రోడ్ల దుస్థితిపై నగర కాంగ్రెస్ అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్రెడ్డి ఆధ్వర్యంలో శనివారం పద్మనగర్లో రోడ్డుపై నాట్లువేసి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కోమటిరెడ్డి నరేంరద్రెడ్డి మాట్లాడుతూ సిరిసిల్ల, వేములవాడ రహదారి బావుపేట వరకు ఎండాకాలంలో దుమ్ముధూళి లేస్తూ, వర్షాకాంలో రోడ్డుపై నీరు నిలిచిపోయి గుంతలమయంగా మారి ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. నగరంలో కూడా ప్రధాన రోడ్ల వ్యవస్థ సరిగా లేదని అన్నారు. వెంటనే రోడ్డు పనులు ప్రారంభించాలని, నగరంలోని రోడ్లపైకి డ్రైనేజీ నీరు వస్తోందని మరమ్మత్తులు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయ కులు సమద్ నవాబ్, ఎస్ఏ మోసిన్, గుండాటి శ్రీనివాస్ రెడ్డి, ఎండీ తాజ్, ఉప్పరి రవి, బానోతు శ్రావణ్ నాయక్, సయ్యద్ అఖిల్, లింగంపల్లి బాబు తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2021-07-25T05:52:22+05:30 IST