Telangana: పెద్దపల్లిలో నీటమునిగిన లారీ యార్డ్
ABN, First Publish Date - 2021-07-23T13:36:20+05:30
జిల్లాలోని శ్రీపాద ఎల్లంపల్లి గేట్లు ఎత్తడంతో గోదావరిఖని గంగనగర్ వద్ద లారీ యార్డ్ నీటమునిగింది.
పెద్దపల్లి: జిల్లాలోని శ్రీపాద ఎల్లంపల్లి గేట్లు ఎత్తడంతో గోదావరిఖని గంగనగర్ వద్ద లారీ యార్డ్ నీటమునిగింది. పలు లారీలు నీటి ప్రవాహంలో చిక్కుకున్నాయి. ప్లైషా ఇటుకలు తయారు చేస్తున్న 40 మంది వరదలో చిక్కుకుపోవడంతో వారిని బయటకు తీసుకరావడానికి రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించారు. మరోవైపు మేడిపల్లి ఓసీపీ రోడ్డు నీట మునిగడంతో రాకపోకలు నిలిచిపోయాయి.
Updated Date - 2021-07-23T13:36:20+05:30 IST