ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వంద శాతం వ్యాక్సినేషన్‌ను పూర్తి చేయాలి

ABN, First Publish Date - 2021-12-07T06:30:57+05:30

వంద శాతం వ్యాక్సినేషన్‌ ప్రక్రియను పూర్తి చేయాలని అదనపు కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ సూచించారు.

మాట్లాడుతున్న అదనపు కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


అదనపు కలెక్టర్‌  కుమార్‌ దీపక్‌

ధర్మారం, డిసెంబరు 6: వంద శాతం వ్యాక్సినేషన్‌ ప్రక్రియను పూర్తి చేయాలని అదనపు కలెక్టర్‌  కుమార్‌ దీపక్‌ సూచించారు. సోమవారం ధర్మారం మండల పరిషత్‌ కార్యాలయంలో వ్యాక్సినేషన్‌పై అధికారులతో అదనపు కలెక్టర్‌ సమీక్షించారు. అనంతరం నందిమేడారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వ్యాక్సినేషన్‌ను పరీశీలించి వైద్య సిబ్బందికి పలు సూచనలు ఇచ్చారు. ఓటర్‌ జాబితాను పరిగణలోకి తీసుకుని ప్రతి ఒక్కరికీ వ్యాక్సినేషన్‌ వేయాలని ఆయన సూచించారు. కరోనా బారిన పడకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆయన చెప్పారు. కొవిడ్‌పై ప్రజల్లో పూర్తిగా అవగాహన కల్పించి వ్యాక్సినేషన్‌ వేయాలని ఆయన సూచించారు. ఎప్పటికప్పుడు గ్రామాల్లో వ్యాక్సినేషన్‌ ప్రక్రియపై క్షేత్రస్థాయిలో అధికారులు పరీశీలించి చర్యలు తీసుకోవాలని ఆయన చెప్పారు. అదేవిధంగా ప్రతీ గ్రామంలో ఇంటి పన్ను వసూలు చేయాలని ఆయన సంబంధిత పంచాయతీ కార్యదర్శులకు సూచించారు. ఆయన వెంట ఎంపీపీ ముత్యాల కరుణశ్రీ, ఎంపీడీవో జయశీల, వైద్యాధికారి సంపత్‌, ఎంపీవో కిరణ్‌, ఏపీవో రవీందర్‌, పంచాయతీ కార్యదర్శులు ఉన్నారు. 


Updated Date - 2021-12-07T06:30:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising