రైతులకు మద్దతుగా ఎల్లుండి నిరసన: మంత్రి Gangula
ABN, First Publish Date - 2021-11-10T19:49:19+05:30
రైతులకు మద్దతుగా ఎల్లుండి నిరసన చేపట్టనున్నట్లు మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు.
కరీంనగర్: రైతులకు మద్దతుగా ఎల్లుండి నిరసన చేపట్టనున్నట్లు మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ రైతులను కేంద్రం ఇబ్బంది పెడుతోందన్నారు. కేంద్రం దిగొచ్చే వరకు ఆందోళన చేపడతామని స్పష్టం చేశారు. రైతుల విషయంలో లాభాల గురించి ఆలోచించొద్దని సూచించారు. పంజాబ్ పంట కొంటారు.. తెలంగాణ పంట కొనరా? అని ప్రశ్నించారు. మోదీ ఇంటి ముందు కిషన్రెడ్డి, బండి సంజయ్ ధర్నా చేయాలన్నారు. స్టేట్మెంట్లు కాదని.. కేంద్రం నుంచి లెటర్ తేవాలని మంత్రి గంగుల డిమాండ్ చేశారు.
Updated Date - 2021-11-10T19:49:19+05:30 IST