వైభవంగా లక్ష్మీనరసింహ స్వామి రథోత్సవం
ABN, First Publish Date - 2021-03-05T05:52:04+05:30
మండల కేంద్రంలోని లక్ష్మీనరసింహ స్వామి జా తర బ్రహ్మోత్సవాలలో భాగంగా గురువారం స్వామి వారి రథోత్సవం అం గరంగ వైభవంగా నిర్వహించారు.
బీర్పూర్,మార్చి 4 : మండల కేంద్రంలోని లక్ష్మీనరసింహ స్వామి జా తర బ్రహ్మోత్సవాలలో భాగంగా గురువారం స్వామి వారి రథోత్సవం అం గరంగ వైభవంగా నిర్వహించారు. కొండపై దేవస్థానంలో సాయంత్రం మహా పూర్ణాహుతి నిర్వహించిన అనంతరం స్వామి వారల ఉత్సవ మూ ర్తులను ఊరేగించారు. నరసింహస్వామి గోవిందా, నమో నారసింహ స్వామీ అంటూ వేలాది భక్తులు రథంపై ఊరేగారు. జిల్లా నలుమూలల నుంచి కాకుండా చుట్టు పక్కల జిల్లా నుంచి భక్తులు పెద్ద ఎత్తున రా వడంతో ఆ ప్రాంతంమంతా భక్తులతో కిక్కిరిసిపోయింది. ఆలయ ఈవో శ్రీనివాస్ ఏర్పాట్లను పర్యవేక్షించగా డీఎస్పీ వెంకట రమణ ఆద్వర్యంలో జగిత్యాల రూరల్ సీఐ కృష్ణ కుమార్, స్థానిక ఎస్ఐ అనీల్ పాల్గొన్నారు. ఈ రథోత్సవ కార్యక్రమంలో ఎంపీపీ మసర్తి రమేష్, జడ్పీటీసీ పాత ప ద్మ రమేష్, స్థానిక సర్పంచ్ గర్షకుర్తి శిల్ప రమేష్, వైస్ ఎంపీపీ బల్మురి లక్ష్మన్ రావ్, బీర్పూర్ సింగిలివిండో చైర్మన్ ముప్పాల రాంచంధర్ రావ్, మాజీ జడ్పీటీసీ సభ్యులు కల్ముల రమణ, ఆయా గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.
Updated Date - 2021-03-05T05:52:04+05:30 IST