ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అత్తింటి వేధింపులు భరించలేక.. పురుగుల మందు తాగి..

ABN, First Publish Date - 2021-06-11T18:11:41+05:30

ముస్తాబాద్ మండలం సేవాలాల్‌తండాకు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముస్తాబాద్/వీర్నపల్లి: ముస్తాబాద్ మండలం సేవాలాల్‌తండాకు చెందిన లకావత్ రాజేశ్వరి(20) అనే వివాహిత అత్తింటి వేధింపులు భరించలేక పురుగుల మందు తాగి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం రాత్రి మృతి చెందింది. ముస్తాబాద్ పోలీసుల వివరాల మేరకు.. వీర్నపల్లి మండలం లాల్‌సింగ్ తండాకు చెందిన భూక్య శ్రీరాం, కవిత దంపతుల కూతురు రాజేశ్వరి, సేవాలాల్ తండాకు చెందిన లకావత్ శ్రీనివాస్‌తో ఆరు నెలల క్రితం ప్రేమ వివాహం జరిగింది. భర్త శ్రీను, అత్త లక్ష్మి, మామ పంతులు వేధింపులు భరించలేక ఈ నెల 8న పురుగుల మందు తాగింది. గమనించిన కుటుంబసభ్యులు ముస్తాబాద్ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో వైద్యుల సూచనల మేరకు సిద్దిపేట ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ బుధవారం మృతిచెందింది. మృతురాలి తల్లి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. కాగా వీర్నపల్లి మండలం లాల్‌సింగ్ తండాలో రాజేశ్వరి అంత్యక్రియలను గురువారం పోలీసు బందోబస్తు మధ్య నిర్వహించారు.

Updated Date - 2021-06-11T18:11:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising