కరీంనగర్ జిల్లా: ఒకరికి చేయాల్సిన ఆపరేషన్ మరొకరికి
ABN, First Publish Date - 2021-06-22T17:12:10+05:30
కరీంనగర్: నగరంలో మాతాశిశు సంరక్షణ కేంద్రంలో వైద్యుల నిర్లక్ష్యం మరోసారి బయటపడింది.
కరీంనగర్: నగరంలో మాతాశిశు సంరక్షణ కేంద్రంలో వైద్యుల నిర్లక్ష్యం మరోసారి బయటపడింది. ఒకరికి బదులు మరొకరికి ఆపరేషన్ చేయబోయారు. బాధితురాలు గట్టిగా కేకలు వేయడంతో అప్పటికే ఆపరేషన్ చేసిన పొట్ట భాగానికి కుట్లు వేశారు. ఒకరి కేసు షీట్ చదివి మరొకరికి చికిత్స చేయడంతో ఇద్దరు శిశువులు ఉన్న గర్భిణి ప్రాణంమీదకు వచ్చింది.
కరీంనగర్ జిల్లా, వీణవంక మండలం, నర్సింగపూర్ గ్రామానికి చెందిన మాలతి 7 నెలల గర్భవతి. ఆమెకు కడుపులో నొప్పి రావడంతో కుటింబీకులు మాతా శిశు సంవరక్షణ కేంద్రానికి తీసుకువచ్చారు. అక్కడ స్కాన్ చేయగా గర్భంలో ఇద్దరు శిశువులు ఉన్నారని గుర్తించారు. అందులో ఒకరే బతుకుతారని, ఒకరిని తీసి మరొకరిని బతికిస్తామని చెప్పి... ఆపరేషన్ థియేటర్కు తీసుకువెళ్లారు. అయితే పక్కనే ఇంకో పేషెంట్ కేసు షీటు చదివిన డాక్టర్ మాలతి పొట్ట కోశారు. అయితే అప్పటికే పూర్తిగా మత్తులోకి జారుకోని మాలతి... గట్టిగా అరిచింది. ఆపరేషన్ తనకు కాదని చెప్పింది. అసలు విషయం తెలుసుకున్న డాక్టర్ ఆమెకు కుట్లు వేశారు. లేకపోతే పెద్ద ప్రమాదం జరిగేది. ఇద్దరు కవలలు, తల్లి ప్రాణానికే ప్రమాదం జరిగేది. డాక్టర్ల నిర్లక్ష్యంపై మాలతి భర్త ఆస్పత్రి సూపరింటెండెంట్కు ఫిర్యాదు చేశారు.
Updated Date - 2021-06-22T17:12:10+05:30 IST