చివరి దశకు Huzurabad ఉప ఎన్నిక ప్రచారం
ABN, First Publish Date - 2021-10-26T13:46:54+05:30
హుజురాబాద్ ఉప ఎన్నిక ప్రచారం చివరి దశకు చేరుకుంది. ఇంటింటి ప్రచారంలో బీజేపీ రాష్ట్ర నేతలు బిజీ బిజీగా ఉన్నారు.
కరీంనగర్: హుజురాబాద్ ఉప ఎన్నిక ప్రచారం చివరి దశకు చేరుకుంది. ఇంటింటి ప్రచారంలో బీజేపీ రాష్ట్ర నేతలు బిజీ బిజీగా ఉన్నారు. ఆఖరి క్షణం వరకు హుజురాబాద్లో ప్రచారం నిర్వహించాలని పార్టీ ఆదేశాలు జారీ చేసింది. రేపటితో హుజురాబాద్ ఉప ఎన్నిక ప్రచారం ముగియనుంది. బీజేపీ నేతలు బండి సంజయ్, కిషన్ రెడ్డి, డీకే అరుణ, విజయశాంతి, ధర్మపురి అరవింద్, రఘనందనరావు, జితేందర్ రెడ్డి తదితరులు హుజురాబాద్లోనే మకాం వేశారు. ఇంఛార్జ్ తరుణ్ చుగ్ బీజేపీ నేతలను సమన్వయం చేస్తున్నారు. ఇప్పటి వరకు ఒక ఎత్తు.. ఇప్పటి నుంచి మరో ఎత్తని కమలనాథులు అంటున్నారు. పోలింగ్ రోజు వరకు అప్రమత్తంగా ఉండాలని పార్టీ నాయకత్వం సూచనలు చేసింది.
Updated Date - 2021-10-26T13:46:54+05:30 IST