ధాన్యం కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించాలి
ABN, First Publish Date - 2021-04-14T06:03:51+05:30
ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రభుత్వం వెంటనే ప్రారంభించాలని జిల్లా సిపిఐ కార్యదర్శి పొగంటి కేదారి డిమాండ్ చేశారు.
సీపీఐ జిల్లా కార్యదర్శి పొనగంటి కేదారి
తిమ్మాపూర్, ఏప్రిల్13: ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రభుత్వం వెంటనే ప్రారంభించాలని జిల్లా సిపిఐ కార్యదర్శి పొగంటి కేదారి డిమాండ్ చేశారు. మంగళవారం పోలంపల్లిలో రోడ్లపై రైతులు ధాన్యాన్ని పోయగా వారిని కలిసిన సీపీఐ బృందం రైతుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. కేదారి మాట్లాడుతు వారం రోజులుగా వరి కోతలు ప్రారంభమయ్యాయన్నారు. రైతులు రోడ్ల పైనే ధాన్యాన్ని ఆరబోసుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి వెంటనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలన్నారు. మండల కార్యదర్శి బోయిని తిరుపతి, మేకాల శ్రీనివాస్, సాయిల్ల తిరుపతి, ఆవునూరి రమేష్, గోశెట్టి భద్రయ్య, కాశివేణి కుమార్, గుంటి కొమురయ్య, ఈర్ట రాజయ్య, పెద్ది శ్రీశైలం, ఇతర నాయకులు, రైతులు పాల్గొన్నారు.
Updated Date - 2021-04-14T06:03:51+05:30 IST