ఘనంగా మంత్రి కొప్పుల జన్మదిన వేడుకలు
ABN, First Publish Date - 2021-04-21T05:46:00+05:30
రాష్ట్ర సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ జన్మదినాన్ని మంగళవారం గోదావరిఖనిలో ఘనంగా నిర్వహించారు.
కళ్యాణ్నగర్, ఏప్రిల్ 20: రాష్ట్ర సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ జన్మదినాన్ని మంగళవారం గోదావరిఖనిలో ఘనంగా నిర్వహించారు. మనోచైతన్య మానసిక వికలాంగుల కేంద్రంలో రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ జన్మదిన కేక్కట్ చేసి మిఠాయిలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మేయర్ బంగి అనీల్కుమార్, డిప్యూటీ మేయర్ నడిపెల్లి అభిషేక్రావు, కార్పొరేటర్ పాముకుంట్ల భాస్కర్, కో ఆప్షన్ సభ్యులు వంగ శ్రీనివాస్, నాయకులు తానిపర్తి గోపాల్రావు, అచ్చె వేణు పాల్గొన్నారు. గోదావరిఖనిలోని టీబీజీకేఎస్ కేంద్ర కార్యాలయంలో యూనియన్ ఆర్జీ-1 ఉపాధ్యక్షులు గండ్ర దామోదర్ ఆధ్వర్యంలో మంత్రి జన్మదినం సందర్భంగా కేక్కట్ చేసి మిఠాయిలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పుట్ట రమేష్, కనకం శ్యామ్సన్, వడ్డేపల్లి శంకర్, వెంకటేష్ పాల్గొన్నారు. మేడిపల్లి ఓసీపీలో పిట్ సెక్రటరీ పొట్టాల రాంచందర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గండ్ర దామోదర్ కేక్కట్ చేశారు. ఈ కార్యక్రమంలో జాహిద్పాషా, గంగాధర్, శంకర్, ఉదయభాను, నామని శ్రీను, బీవీఎస్రెడ్డి, పిడుగు శ్రీను పాల్గొన్నారు. అమ్మపరివార్ అనాథ్ ఆశ్రమంలో చైతన్య మానవవేదిక సంస్థ అధ్యక్షుడు కొప్పుల శంకర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మంత్రి జన్మదిన వేడుకలకు గోదావరిఖని వన్టౌన్ సీఐ రమేష్బాబు హాజరై కేక్కట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొప్పుల ఈశ్వర్ మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు మేడ చక్రపాణి, నూతి సురేష్కుమార్, రవికుమార్, నరేష్ కుమార్, ఎరుకల ప్రదీప్, లింగస్వామి పాల్గొన్నారు.
Updated Date - 2021-04-21T05:46:00+05:30 IST