హరీష్రావువి మోసపు మాటలు: ఈటల
ABN, First Publish Date - 2021-08-12T18:45:07+05:30
హరీష్రావు నిన్న హుజూరాబాద్ నియోజకవర్గంలో అబద్దాలు మాట్లాడి ప్రజలను నమ్మించే ప్రయత్నం..
కరీంనగర్: ఆర్థికమంత్రి హరీష్రావు నిన్న హుజూరాబాద్ నియోజకవర్గంలో అబద్దాలు మాట్లాడి ప్రజలను నమ్మించే ప్రయత్నం చేశారని బీజేపీ నేత ఈటల రాజేందర్ విమర్శించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ అవి మోసపు మాటలని హుజూరాబాద్ ప్రజలకు తెలుసునని అన్నారు. హరీష్రావు తనపై చాలా విమర్శలు చేశారని, అయితే తాను ఇక్కడ ప్రజల ప్రేమను పొంది అప్రతిహాసంగా గెలుస్తున్న వ్యక్తినని చెప్పారు. తన ఆస్తులపై విచారణ జరపాలని అలాగే మీ ఆస్తులపై కూడా విచారణ జరిపించాలని, ఎవరు సంపాదన ఏంతో తేలిపోతుందన్నారు. ఎవరైనా వ్యక్తిగత విమర్శలు చేయకూడదని, సిద్ధాంతపరమైన విమర్ళలు చేయాలన్నారు. టీఆర్ఎస్ నేతల మాటలను తెలంగాణ ప్రజలు నమ్మరని ఈటల రాజేందర్ అన్నారు.
Updated Date - 2021-08-12T18:45:07+05:30 IST