చీకట్లో షేక్హ్యాండ్ ఇచ్చుకుంటున్న కాంగ్రెస్, బీజేపీ
ABN, First Publish Date - 2021-10-20T04:58:39+05:30
కాంగ్రెస్, బీజేపీ నాయకులు చీకట్లో షేక్హ్యాండ్ ఇచ్చుకుంటున్నారని రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి తన్నీరు హరీష్రావు అన్నారు.
- రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్రావు
జమ్మికుంట, అక్టోబరు 19: కాంగ్రెస్, బీజేపీ నాయకులు చీకట్లో షేక్హ్యాండ్ ఇచ్చుకుంటున్నారని రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి తన్నీరు హరీష్రావు అన్నారు. మంగళవారం మున్సిపల్ పరిధిలోని ఆబాది జమ్మికుంటలో కాంగ్రెస్ పార్టీకి చెందిన కసుబోజుల వెంకన్న, ఎండి సలీం ఆధ్వర్యంలో పలువురు టీఆర్ఎస్ పార్టీలో చేరారు. హమాలీ కార్మికులు టీఆర్ఎస్ పార్టీకి మద్దతు ప్రకటిస్తూ తీర్మానం చేశారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్రావు మాట్లాడుతూ మాణిక్కం ఠాగూర్ హుజూరాబాద్కు వచ్చి టీఆర్ఎస్ను తిట్టి వెళ్లాడని, దీనిని బట్టి చూస్తే బీజేపీ, కాంగ్రెస్ పార్టీ ఒక్కటైనట్లు తెలుస్తుందన్నారు. జాతీయ స్థాయిలో రెండు పార్టీలు కొట్లాడుతున్నట్లు కనిపిస్తున్నప్పటికి, ఇక్కడ మాత్రం రెండు పార్టీలు కలిసి పోయాయన్నారు. దళిత బంధు ఆపమని బీజేపీకి చెందిన ప్రేమేందర్రెడ్డి అన్నాడని తెలిపారు. బీజేపీ దళిత, గిరిజన, ముస్లిం, క్రిస్టియన్ల వ్యతిరేక పార్టీ అన్నారు. ఈటలకు ఢిల్లీలో పలుకుబడి ఉంటే గ్యాస్ ధరలు తగ్గించాలన్నారు. గెల్లు శ్రీనివాస్ను గెలిపిస్తే తాను, కొప్పుల ఈశ్వర్ కలిసి హుజూరాబాద్ను అభివృద్ధి చేస్తామన్నారు.
Updated Date - 2021-10-20T04:58:39+05:30 IST