రాజీ మార్గంలోనే కేసులకు పరిష్కారం
ABN, First Publish Date - 2021-09-18T06:36:38+05:30
ప్రతి కేసును కోర్టుల ద్వారా కాకుండా రాజీమార్గం ద్వారా కేసులకు పరిష్కార మార్గం దొరుకుతుందని పెద్దపల్లి సబ్కోర్డు సీనియర్ సివిల్ జడ్జి వరూధిని అన్నారు.
- చట్టాలపై అవగాహన తప్పనిసరిగా ఉండాలి
- సీనియర్ సివిల్ జడ్జి వరూధిని
పెద్దపల్లి రూరల్, సెప్టెంబరు 17 : ప్రతి కేసును కోర్టుల ద్వారా కాకుండా రాజీమార్గం ద్వారా కేసులకు పరిష్కార మార్గం దొరుకుతుందని పెద్దపల్లి సబ్కోర్డు సీనియర్ సివిల్ జడ్జి వరూధిని అన్నారు. శుక్రవారం మండలంలోని గుర్రాంపల్లిలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సంధర్బంగా జడ్జి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ చట్టాలపై అవగాహన ఉండటంతో పాటు ప్రతి విషయాన్ని కోర్టు ద్వారా పరిష్కారం కాకుండా న్యాయ విజ్ణాన సదస్సుల దృష్టికి తీసుకోచ్చి సమస్యలకు పరిష్కార మార్గం తీసుకోవాలన్నారు. సదస్సులో బార్ అసోసియేషన్ అధ్యక్షులు దాసరి వెంకటరమణారెడ్డి, ప్రధాన కార్యదర్శి భాస్కర్, గ్రామ సర్పంచ్ మాదిరెడ్డి భాగ్యలక్ష్మీ, పెద్దపల్లి సింగిల్విండో చైర్మన్ మాదిరెడ్డి నరసింహారెడ్డి, పెద్దపల్లి ఎస్ఐ రాజే ష్, న్యాయవాదులు హనుమాన్ సింగ్, శ్రీనివాస్, రెడ్డి శంకర్లతో పాటు పలువురు పాల్గొన్నారు. అనంతరం గ్రామ యువకులు, పెద్దపల్లి లయన్స్ క్లబ్ శాతకర్ణి వారు జడ్జిని సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఆకుల స్వామి వివేక్, కోమటిపల్లి రాజేందర్, భాస్కర్రెడ్డి, గా దం శ్రీనివాస్లు పాల్గొన్నారు.
Updated Date - 2021-09-18T06:36:38+05:30 IST